పేలుడు ప్రమాదంలో మరో ఇద్దరి మృతి

పేలుడు ప్రమాదంలో మరో ఇద్దరి మృతి


కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కొత్తపల్లి మండలం వాకతిప్ప గ్రామంలో సోమవారం జరిగిన బాణాసంచా పేలుడు ప్రమాదానికి సంబంధించి మరో ఇద్దరు మృతి చెందారు. ఈ దుర్ఘటనలో 12 మంది చనిపోయిన విషయం తెలిసిందే. కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో ఇద్దరు అర్ధరాత్రి దాటిన తరువాత మృతి చెందారు.



ఈ ఘటనలో మృతుల సంఖ్య 14కు చేరింది. మృతి చెందినవారిలో ఇద్దరిని ఇంకా గుర్తించలేదు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నవారిలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు చెప్పారు.



ఇదిలా ఉండగా,  ఈ దుర్ఘటనలో మృతి చెందినవారి కుటుంబ సభ్యులను, క్షతగాత్రులను పరామర్శించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు ఇక్కడికి వస్తున్నారు.

**

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top