మరో ఇరవై నాలుగు గంటలు వానలు
విశాఖపట్నం: తెలుగు రాష్ట్రాల్లో మరో 24 గంటల పాటు వర్షాలు కురవనున్నాయి. బిహార్ నుంచి జార్ఖండ్ మీదుగా దక్షిణ ఒడిశా వరకూ అల్పపీడన ద్రోణి, నైరుతి బంగాళాఖాతంలో కొరమరిన్ తీరంపై మరో ద్రోణి కొనసాగుతున్నాయి. దీనికి ఉపరితల ఆవర్తనం కూడా తోడయింది.
వీటి ప్రభావం వల్ల వచ్చే 24 గంటల్లో కోస్తా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షం లేదా, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం శనివారం సాయంత్రం విడుదల చేసిన నివేదికలో తెలిపింది.