రాజధాని గ్రామాల రైతులకు ఒకేసారి రుణమాఫీ


విజయవాడ: ఏపీ రాజధాని గ్రామాల రైతలకు ఒకేసారి రుణమాఫీ చేస్తూ  ఆ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం జీవో విడుదల చేసింది. అర్హులైన వారికి రూ.1.50 లక్షలు ఓకేసారి చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 7403  మంది రైతులకు రుణమాఫీ వర్తింప చేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కోంది. తుళ్లూరు పరిధిలోని  3 మండలాల్లోని 25 గ్రామాల రైతులకు ఈ రుణమాఫీ వర్తించనుంది.  కాని రాజధాని గ్రామాల డ్వాక్రా మహిళలకు మాత్రం రుణమాఫీ వర్తించదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top