ఆంధ్రాకు రూడీ.. తెలంగాణకు కృష్ణదాస్
రాష్ట్రాలకు బీజేపీ ఇన్చార్జిల నియామకం
న్యూఢిల్లీ: బీజేపీ 28 రాష్ట్రాలకు పార్టీ వ్యవహారాల ఇన్చార్జిలను నియమించింది. ఆంధ్రప్రదేశ్కు రాజీవ్ ప్రతాప్రూడీ, తెలంగాణకు పి.కె.కృష్ణదాస్ను నియమిస్తూ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్షా నిర్ణయం తీసుకున్నారు. ఆ పార్టీ ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. రాజీవ్ప్రతాప్ ఏపీతో పాటు తమిళనాడుకు కూడా ఇన్చార్జిగా నియమితులయ్యారు. కాగా, తెలంగాణకు చెందిన పార్టీ నేత, జాతీయ ప్రధాన కార్యదర్శి పి.మురళీధర్రావు కర్ణాటక వ్యవహారాల ఇన్చార్జిగా నియమితులయ్యారు.