షరతులు, పరిమితులను నిరసిస్తూ..

షరతులు, పరిమితులను నిరసిస్తూ.. - Sakshi


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ సమర శంఖం పూరించింది. ఎన్నికల హామీల అమలుపై మీనమేషాలు లెక్కిస్తున్న టీడీపీ సర్కారుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టేందుకు సిద్దమైంది.



ఈ నెల 4న ఏపీలో అన్ని జిల్లా కలెక్టరేట్ల ఎదుట నిరసనలు చేపట్టాలని నిర్ణయించినట్టు కాంగ్రెస్ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు తెలిపారు. వ్యవసాయ మాఫీపై షరతులు, పరిమితులు విధించడాన్నినిరసిస్తూ ఈ ఆందోళనలకు పిలుపునిచ్చినట్టు  చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు, డ్వాక్రా, చేనేత రుణాలను మాఫీ చేయాలని పద్మరాజు డిమాండ్ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top