సీఎస్ టక్కర్ పదవీకాలం పొడిగింపు

సీఎస్ టక్కర్ పదవీకాలం పొడిగింపు - Sakshi


హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.పి. టక్కర్‌ పదవీ కాలాన్ని కేంద్రం మరో మూడు నెలలు పొడిగించింది. మంగళవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా షెడ్యూల్‌ ప్రకారం ఆయన ఈ నెల 31న రిటైర్‌ కావాల్సి ఉంది. కాగా టక్కర్ ను మరో ఆరునెలల పాటు కొనసాగించాలని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. అయితే ఒక విడతలో మూడు నెలలు మాత్రమే కొనసాగించేందుకు అవకాశముంది. ఈ ఏడాది నవంబరు 30 వరకూ టక్కర్‌ సీఎ్‌స్ గా కొనసాగుతారు. కాగా తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ పదవీ కాలం కూడా మూడు నెలలపాటు కేంద్ర ప్రభుత్వం పొడిగించిన విషయం తెలిసిందే.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top