రేపు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటి
హైదరాబాద్: రిజిస్ట్రేషన్లు, భూముల ధరల పెంపు,1956 స్థానికతపై ప్రధానికి లేఖ రాయడం తదితర అంశాలపై చర్చించేందుకు శుక్రవారం ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం కానుంది.
స్థానికతపై న్యాయపోరాటం, నూతన ఐటీపాలసీ, ఇసుక పాలసీపైనా చర్చించే అవకాశం ఉందని పార్టీ నేతలు వెల్లడించారు. రేపు ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ భేటీ అయ్యే అవకాశం ఉంది.