ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం శనివారమిక్కడ సమావేశమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో రాజధాని శంకుస్థాపన ఏర్పాట్ల అంశమే ప్రధాన అజెండాగా చర్చ జరగనుంది. అలాగే ఈ భేటీలో రాజమండ్రి పేరు రాజమహేంద్రవరంగా మార్పు అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలంపై ఏపీ కేబినెట్ చర్చించనుంది.