ఏపీ అసెంబ్లీ శుక్రవారానికి వాయిదా
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. గురువారం అసెంబ్లీ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే వెంకటరమణ మృతిపై సభలో సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. అలాగే పెషావర్ మృతులకు అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. సంతాప తీర్మానం అనంతరం ...మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం స్పీకర్ కోడెల శివప్రసాద్...అసెంబ్లీని శుక్రవారానికి వాయిదా వేశారు.