అసెంబ్లీ 4 గంటలకు వాయిదా
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సాయంత్రానికి వాయిదా పడ్డాయి. 4 గంటలకు అసెంబ్లీ మళ్లీ సమావేశంకానుంది.
సోమవారం ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నాలుగో రోజు సమావేశంలో రుణమాఫీ, రైతుల ఆత్మహత్యలపై చర్చ జరిగింది. చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.