రేపు ఏపీ కేబినెట్ భేటీ
హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ బుధవారం ఉదయం పది గంటలకు సమావేశం కానుంది. త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు, రాష్ట్ర బడ్జెట్ కేటాయింపులపై ఆ భేటీలో చర్చించనున్నారు. దీంతో పాటు కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయంపై కూడా కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. ప్రధాని, కేంద్ర మంత్రులను కలవడంపై ఆ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు.
ఏపీ రాజధాని భూసమీకరణ, తాత్కాలిక రాజధాని ఏర్పాటుపై ప్రధానంగా చర్చించనున్నారు. రెండో విడత రుణమాఫీ, పారిశ్రామిక విధానంపైతోపాటు, వేసవిలో తాగునీటి ఎద్దడి, స్మార్ట్ ఏపీ అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు.