బాబుకు వత్తాసు పలుకుతున్న పవన్

బాబుకు వత్తాసు పలుకుతున్న పవన్ - Sakshi


అనంతపురం: నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడికి వత్తాసు పలికుతున్నారని అనంతపురం వైఎస్సార్ సీపీ నేతలు ఆరోపించారు. మంగళవారం అనంతపురం నగరంలో పలువురు వైఎస్సార్ సీపీ నేతలు జిల్లా ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.


పవన్ కల్యాణ్ తీరును వారు ఈ సందర్భంగా తప్పు బట్టారు. ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీలకు అనుకులంగా ప్రచారం నిర్వహించి... సదరు పార్టీలు అధికారంలోకి వచ్చి..  ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే తాను వ్యతిరేకిస్తానని పవన్ ప్రకటించారని వారు ఈ సందర్భంగా గుర్తు చేశారు.


కాని పవన్కల్యాణ్ ప్రస్తుతం కోట్లకు నోట్ల వ్యవహరంలో చంద్రబాబుకు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు.  కోట్లు దండుకోవడానికే పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టారని వైఎస్సార్ సీపీ నేతలు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధికార ప్రతినిధి శ్రీనివాసరెడ్డి, నగర అధ్యక్షుడు గోపాల రెడ్డి, రైతు విభాగం నాయకుడు వెంకట చౌదరి పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top