'సాధిక్ హత్యతో మాకు సంబంధం లేదు'


హైదరాబాద్: అనంతపురం జిల్లా తాడిపత్రి టీడీపీ కౌన్సిలర్ సాధిక్ హత్య కేసుతో తమకు సంబంధం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు స్పష్టం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ జిల్లా ఎస్పీని కలసి ఈ మేరకు విన్నవించారు.



అక్రమ కేసులు ఎత్తివేయాలని ఎస్పీని కోరారు. గురువారం గుర్తుతెలియని దుండగులు వేటకొడవళ్లతో సాధిక్ను నరికారు. ఈ దుర్ఘటనలో తీవ్రంగా గాయపడిన సాధిక్ ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top