కేసీఆర్ కేసుపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వండి

కేసీఆర్ కేసుపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వండి - Sakshi


అనంతపురం : టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్... హీరో పవన్ కళ్యాణ్పై అనుచిత, వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో పోలీసులు 15రోజుల్లోగా విచారణ పూర్తి చేసి నివేదిక అందించాలని అనంతపురం కోర్టు టూటౌన్ పోలీసుల్ని ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు బుధవారం తమ నివేదిక సమర్పించాల్సి ఉంది. అయితే తమకు మరికొంత సమయం కావాలని పోలీసులు కోర్టును కోరారు. దాంతో కేసు నమోదు చేసిన న్యాయవాది మురళీకృష్ణ వాదనను కోర్టు నమోదు చేసింది. కాగా ఈ కేసుకు సంబంధించి  కేసీఆర్‌పై 153, 506, 307, 109, 156  సెక్షన్ల కింద కేసు నమోదు అయిన విషయం తెలిసిందే.



 

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top