విద్యుదాఘాతంతో యువకుడి మృతి


కడప టౌన్: కడప పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వెల్డింగ్ పనులు చేస్తున్న ఒక యువకుడు విద్యుదాఘాతంతో గురువారం మృతిచెందాడు. రవిశంకర్ అనే యువకుడు వెల్డింగ్ షాప్‌లో పనిచేస్తున్నాడు. ప్రతిరోజు లాగానే ఈ రోజు షాపులో పనిచేస్తుండగా అతనికి కరెంట్ షాక్ కొట్టింది. దాంతో రవిశంకర్ అక్కడికక్కడే మృతిచెందాడు. పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top