వైఎస్‌ జగన్‌కు అమిత్‌ షా ఫోన్‌ కాల్‌

వైఎస్‌ జగన్‌కు అమిత్‌ షా ఫోన్‌ కాల్‌ - Sakshi


న్యూఢిల్లీ: బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా సోమవారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఫోన్‌ కాల్‌ చేశారు. ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌కు మద్దతు తెలపాలని అమిత్‌ షా ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ను కోరారు. రాష్ట్రపతి అభ్యర్థి కోవింద్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తామని వైఎస్‌ జగన్‌ ఈ సందర్భంగా  తెలిపారు. 


‘రామ్‌నాథ్‌ కోవింద్‌ అభ్యర్థిత్వానికి నేను, మా పార్టీ హృదయపూర్వకంగా మద్దతు ఇస్తున్నాం. రామ్‌నాథ్‌ కోవింద్‌ గొప్ప రాజనీతిజ్ఞుడు’ అని వైఎస్‌ జగన్‌ ట్విట్‌ చేశారు. కాగా కొద్దిరోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయిన వైఎస్‌ జగన్‌...ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించిన విషయం తెలిసిందే.


మరోవైపు తెలంగాణ సీఎం, టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ కూడా రామ్‌నాథ్‌ కోవింద్‌ అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా  టీఆర్‌ఎస్‌ ఎంపీ కవిత మాట్లాడుతూ కోవింద్‌ అభ్యర్థిత్వాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top