నేడు విజయవాడకు అమిత్‌ షా

నేడు విజయవాడకు అమిత్‌ షా - Sakshi


బూత్‌ స్థాయి నేతల మహా సమ్మేళనానికి హాజరు



సాక్షి, అమరావతి: భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా గురువారం రాష్ట్ర పర్యటనకు రానున్నారు. విజయవాడలో ఆ పార్టీ నిర్వహించే బూత్‌ స్థాయి నేతల మహా సమ్మేళనంలో ఆయన పాల్గొంటారు. విజయవాడ సిద్దార్థ్ధ మెడికల్‌ కాలేజీ గ్రౌండ్‌లో సాయంత్రం ఐదు గంటలకు కార్యక్రమం మొదలవుతుంది.



ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర పర్యటనలో ఉన్న అమిత్‌ షా ఉదయం తొమ్మిదిన్నర గంటలకే గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడ నుంచి తాడేపల్లి కరకట్టపైన ఉన్న ఎంపీ గోకరాజు గంగరాజు అతిథి గృహంలో విశ్రాంతి తీసుకుంటారు. కాగా అమిత్‌ షాను సీఎం చంద్రబాబు విందుకు ఆహ్వానించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top