'ఉత్సవ దినం కాదు.. నయవంచన దినం'

'ఉత్సవ దినం కాదు..  నయవంచన దినం' - Sakshi


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి ఏడాది పాలన వంచనతో సాగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. జూన్ 2న నవ నిర్మాణ దీక్షను ఉత్సవ దినంగా ఎందుకు పాటించాలని ప్రశ్నించారు. ఉత్సవం దినం కంటే నయవంచన దినంగా పాటిస్తే బాగుంటుందని అంబటి రాంబాబు అన్నారు.



చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేసిన తొలి సంతకాల్లో ఒకటీ అమలు కాలేదని, చెప్పిన అబద్ధం చెప్పకుండా చెబుతున్నారని అంబటి రాంబాబు ఆరోపించారు. చంద్రబాబు ప్రచారం కోసం ఇచ్చే ప్రాధాన్యం అభివృద్దిపై పెడితే మంచిదని అంబటి రాంబాబు సూచించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top