'మంత్రులంతా హైదరాబాద్ లో ఉండాల్సిందే'
హైదరాబాద్:ప్రతి శనివారం మంత్రులంతా హైదరాబాద్ లో ఉండాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. మంత్రులు గత నాలుగు వారాలుగా హైదరాబాద్ లో అందుబాటులో లేకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి ప్రతి శనివారం మంత్రులు నగరంలో అందుబాటులో ఉండేల్సిందేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు, ఇతర పార్టీ ప్రజా ప్రతినిధులు కలిసినప్పుడు మంత్రులు లేకపోతే పనులు ఎలా అవుతాయంటూ అసహనం వ్యక్తం చేశారు.
ఈమేరకు ఆయన సీఎం కార్యాలయం నుంచి మంత్రులందరికీ ఫోన్ చేయించారు. రేపు కచ్చితంగా మంత్రులంతా హైదరాబాద్ లో ఉండాలని ఆయన సూచించారు.
సంబంధిత వార్తలు