విశాఖలో అఖిల భారత విప్‌ల సదస్సు


హైదరాబాద్: అఖిల భారత 17వ విప్‌ల సదస్సు ఈనెల 29, 30 తేదీల్లో విశాఖపట్నంలో జరగనుంది. ఈ సదస్సుకు ప్రభుత్వ విప్‌లు, పార్టీల విప్‌లు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిని ఆహ్వానిస్తూ కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్య నాయుడి నుంచి సీఎం కేసీఆర్‌కు లేఖ అందింది.



దీంతో రాష్ట్ర శాసన సభా వ్యవహారాల మంత్రి హరీష్‌రావు, చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, విప్ గొంగిడి సునీత, అసెంబ్లీ కారదర్శి రాజ సదారాంతో గురువారం అసెంబ్లీలో సమావేశమై చర్చించారు. పార్లమెంటు, శాసన సభా వ్యవహారాలపై చర్చించనున్న ఈ సదస్సుకు హాజరయ్యేందుక వీలుగా ఆయా పార్టీలకు, విప్‌లకూ సమాచారం ఇవ్వాలని కార్యదర్శిని ఆదేశించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top