వడదెబ్బతో వ్యవసాయాధికారి మృతి


ఆళ్లగడ్డ (కర్నూలు జిల్లా) : వడదెబ్బతో ఆళ్లగడ్డ వ్యవసాయాధికారి బి. రామకృష్ణ(47) మృతి చెందారు. ఒక పని విషయమై గురువారం హైదరాబాద్ వచ్చిన ఆయన తిరిగి ఆళ్లగడ్డ వెళ్తుండగా వడదెబ్బకు గురయ్యారు. ఆయన గత ఆరేళ్లుగా ఆళ్లగడ్డలో వ్యవసాయాధికారిగా పని చేస్తున్నారు. మృతుడికి భార్య మాత్రమే ఉన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top