వడదెబ్బతో వ్యవసాయాధికారి మృతి
ఆళ్లగడ్డ (కర్నూలు జిల్లా) : వడదెబ్బతో ఆళ్లగడ్డ వ్యవసాయాధికారి బి. రామకృష్ణ(47) మృతి చెందారు. ఒక పని విషయమై గురువారం హైదరాబాద్ వచ్చిన ఆయన తిరిగి ఆళ్లగడ్డ వెళ్తుండగా వడదెబ్బకు గురయ్యారు. ఆయన గత ఆరేళ్లుగా ఆళ్లగడ్డలో వ్యవసాయాధికారిగా పని చేస్తున్నారు. మృతుడికి భార్య మాత్రమే ఉన్నారు.