మావుళ్లమ్మ మహిమ గల తల్లి

మావుళ్లమ్మ మహిమ గల తల్లి - Sakshi


 భీమవరం : భీమవరం ప్రజల ఇలవేల్పు శ్రీ మావుళ్లమ్మ ఎంతో మహిమగల తల్లి అని సినీ నటి, ఎమ్మెల్యే ఆర్‌కే రోజా పేర్కొన్నారు. భీమవరం విచ్చేసిన ఆమె విలేకరులతో మాట్లాడుతూ మావుళ్లమ్మ విశిష్టతను మూడేళ్ల క్రితం ఓ షూటిం గ్‌లో ఒక ఫొటోగ్రాఫర్ తనకు చెప్పారని, అప్పటి నుంచి అమ్మవారిని దర్శించుకోవాలని భావించినా సమయం దొరకలేదన్నారు. ఇప్పుడు తల్లి ఆలయ ప్రాంగణంలో సత్కారం అందుకునే అవకాశం రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తనకు మొదటి నుంచి దైవ భక్తి ఎక్కువని, పలు సినిమాల్లో అమ్మవార్ల పాత్రలను ధరించానని వివరించారు. కార్తీక మాసంతోపాటు పలు సందర్భాల్లో ప్రజల సౌభాగ్యం కోసం తాను సుదర్శన, ఇతర హోమాలు చేయిస్తుం టానని వివరించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని రోజా ఆకాంక్షించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top