రోడ్డు ప్రమాదంలో కవితకు గాయాలు
కృష్ణా: టీడీపీ నాయకురాలు, సీనీనటి కవిత రోడ్డు ప్రమాదంలో స్వల్పగాయాలతో బయటపడ్డారు. శనివారం మద్యాహ్నం జిల్లాలోని జగ్గయ్యపేట వద్ద కవిత ప్రయాణిస్తోన్న కారు.. ఆగిఉన్న కంటైనర్ ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కవితను సమీప ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.