కళలపై అవగాహనతోనే జీవన సాఫల్యం
- ‘బొల్లిముంత’ పురస్కారం సభలో తనికెళ్ల భరణి
తెనాలి: అభ్యుదయ రచయిత బొల్లిముంత శివరామకృష్ణ స్మారక నాటకోత్సవాల్లో భాగంగా ‘బొల్లిముంత శివరామకృష్ణ కళా పురస్కారాన్ని’ ప్రముఖ సినీ నటుడు, దర్శక, రచయిత తనికెళ్ల భరణికి ప్రదానం చేశారు. గుంటూరు జిల్లా తెనాలి జేఎంజే కళాశాల ఆడిటోరియంలో గురువారం మధ్యాహ్నం నాటకోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా బొల్లిముంత ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన సభలో తనికెళ్ల భరణికి పురస్కారాన్ని అందించారు. భరణి మాట్లాడుతూ.. శివరామకృష్ణ కళా పురస్కారం అందుకోవడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్టు చెప్పారు.