యాక్షన్ టీం కలకలం

యాక్షన్ టీం కలకలం - Sakshi

  •     పాడేరు పాలిటెక్నిక్‌లో నలుగురు బస

  •      విద్యార్థులతో సమావేశం

  •      పోలీసుల విస్తృత తనిఖీలు

  • పాడేరు: ఇక్కడి తలారిసింగి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో మావోయిస్టు యాక్షన్ టీం సంచారం కలకలం రేపింది. ఓ మహిళ, ము గ్గురు యువకులతో కూడిన యాక్షన్ టీం శనివారం రా త్రి పాలిటెక్నిక్ క ళాశాల విద్యార్థులతో సమావేశమైంది. ఈ సమాచారం ఆలస్యంగా ఆదివారం సాయంత్రం పోలీసులకు అందింది. దీంతో బలగాలు కళాశాలను చుట్టుముట్టాయి.



    ఈ నలుగురు ఎందుకు వచ్చిందీ, ఎప్పుడు వెళ్లారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది. ఎస్‌ఐ ధనుంజయ్ సిబ్బందితో విద్యార్థులు బస చేసే అన్ని గదులను తనిఖీ చేశారు. వారి గుర్తింపు కార్డులు, పెట్టెలు, బ్యాగులను తనిఖీ చేశారు. రాత్రి వచ్చిన వారి వివరాలను ఆరా తీశారు. మావోయిస్టు యాక్షన్ టీం ఇక్కడి విద్యార్థులకు తుపాకులు,పేలుడు సామగ్రి ఇచ్చివుంటుందన్న అనుమానంతో పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు.



    కళాశాల ఇన్‌చార్జి ప్రిన్స్‌పాల్, వార్డెన్, ఆదివారం రాత్రి విధులు నిర్వహించిన వాచ్‌మన్‌లను కూడా పోలీసులు విచారించారు. బయటకు వెళ్లిన కొందరు విద్యార్థుల వివరాలు సేకరిస్తున్నారు. ఈ సంఘటనతో పాడేరులో కలకలం చోటుచేసుకుంది. విద్యార్థులు కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే యాక్షన్ టీంతో మాట్లాడిన విద్యార్థుల వివరాలు మాత్రం వెలుగులోకి రావడం లేదు. పాడేరు పట్టణంలోనూ పోలీసులు తనిఖీలు చేపట్టారు. అదనపు పోలీసు బలగాలు ప్రధాన కూడళ్లలో మొహరించాయి.

     

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top