ట్రాన్స్‌ఫార్మర్ దొంగలకు జైలు


చింతకొమ్మదిన్నె(వైఎస్సార్‌జిల్లా): వ్యవసాయ బావుల వద్ద ఉన్న ఐదు ట్రాన్స్‌ఫార్మర్‌లు ఎత్తుకెళ్లిన దొంగల ముఠాకు ఆరు నెలలు జైలు శిక్ష విధిస్తూ జిల్లా న్యాయస్థానం తీర్పునిచ్చింది. వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం జమాల్‌పల్లి గ్రామ పరిధిలో ఐదు ట్రాన్స్‌ఫార్మర్‌లను ఎత్తుకెళ్లిన దొంగల ముఠాను 2013 అక్టోబర్‌లో పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించగా.. మంగళవారం నాడు నేరం రుజువు కావడంతో వారికి న్యాయమూర్తి ఆరు నెలల జైలు శిక్ష విధించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top