రైలు నుంచి జారిపడి తండ్రి, కొడుకు దుర్మరణం


నక్కపల్లి (విశాఖపట్టణం): విశాఖ జిల్లా నక్కపల్లి మండలం గుల్లిపాడు వద్ద నడుస్తున్న రైలు నుంచి జారి పడిపోయి ఓ తండ్రీకొడుకు మృతి చెందారు. విజయనగరం జిల్లా రాంభద్రాపురం మండలం కొండచిగువ గ్రామానికి చెందిన అగతాని వెంకట్రావు(45), ఆయన భార్య, కుమారుడు నవీన్(17) ఇటుకబట్టీల్లో పనిచేసేందుకు రాజమండ్రి నుంచి విజయనగరం వెళ్తున్నారు. తండ్రి, కొడుకు రైలు తలుపు వద్ద కూర్చున్నారు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో నక్కపల్లి మండలం గుల్లిపాడు వద్ద నిద్ర మత్తులో నవీన్ రైలు నుంచి జారిపడగా అతనిని రక్షించే క్రమంలో వెంకట్రావు కూడా కిందకి పడిపోయాడు.


తండ్రీకొడుకు ఇద్దరూ సంఘటన స్థలంలోనే మృతిచెందారు. అయితే, ఈ విషయం తెలియని వెంకట్రావు భార్య రాజమండ్రి చేరుకున్న తర్వాత భర్త, కుమారుడు కనిపించకపోవటంతో వారిని వెతుక్కుంటూ వెనక్కివెళ్లింది. అలా గుల్లిపాడుకు చేరుకుని రైలు పట్టాల వద్ద పడి ఉన్న మృతదేహాలను గుర్తించి కన్నీరుమున్నీరయింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top