ఏపీ ప్రభుత్వాధికారుల ఇళ్లపై ఏసీబీ దాడులు
శ్రీకాకుళం : శ్రీకాకుళం జిల్లాలో ఏసీబీ అధికారులు ఏకకాలంలో పలువురు ప్రభుత్వ అధికారుల ఇళ్లపై దాడులు చేశారు. డీసీటీవో అనసూయ, మైనర్ ఇరిగేషన్ అధికారి వరప్రసాద్ నివాసాలపై అధికారులు బుధవారం ఉదయం ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు వారిపై అభియోగాలు రావటంతో ఏసీబీ సోదాలు చేపట్టింది.
అధికారుల బంధువుల ఇళ్లపై కూడా అధికారుల సోదాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులు బయటపడినట్లు సమాచారం. సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. డీసీటీవో అనసూయ, ఇరిగేషన్ అధికారి వరప్రసాద్ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.