ఫారెస్ట్ ఆఫీసర్ ఇంటిపై ఏసీబీ దాడులు


గోపాలపురం : పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం మండలం దొండపూడి గ్రామంలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఎం. నాగేశ్వరరావు ఇంటిపై ఏసీబీ అధికారులు మంగళవారం సాయంత్రం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా లెక్కలు చూపని రూ.1.60 లక్షల నగదును స్వాధీనం చేసుకున్న అధికారులు ఇంట్లో లభించిన పలు పత్రాలను తనిఖీ చేస్తున్నారు. అక్రమాస్తులపై సమాచారం అందుకున్న ఏసీబీ అధికారులు ఈ సోదాలు చేపట్టారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top