వీఆర్వో ఇంటిపై ఏసీబీ దాడులు
మనుబోలు (నెల్లూరు జిల్లా) : నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెర్లోపల్లి వీఆర్ఓ ఉపేంద్ర ఇంటిపై శనివారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. విజయవాడ విద్యుత్ శాఖలో పనిచేసే ఉపేంద్ర సోదరుడు ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నాడని ఫిర్యాదులు రావడంతో ఆయన ఇంటితోపాటు ఆయన బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులు ఒకేసారి దాడులు నిర్వహించారు. చెర్లోపల్లి వీఆర్వో ఇంటిపై ఏసీబీ సీఐ నర్సిరెడ్డి ఆధ్వర్యంలో అధికారులు దాడులు నిర్వహించారు. తనిఖీలు ఇంకా కొనసాగుతున్నాయి.