ఏసీబీకి చిక్కిన అవినీతి వీఆర్వో


 విశాఖపట్నం జిల్లా గాజువాక వీఆర్వో కేఎస్వీ ప్రసాద్‌రావు అవినీతి నిరోధక శాఖ అధికారులకు బుధవారం పట్టుబడ్డాడు. లంచం తీసుకుంటుండగా వీఆర్వోను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి... జంగాల కాలనీకి చెందిన దాసరి కనకరాజు తన కూతురు కోసం తూర్పు కాపు సర్టిఫికెట్ కావాలని తహశీల్దార్ కార్యాలయంలో వీఆర్వోగా పనిచేస్తున్న ప్రసాద్‌రావు, అతడి ప్రైవేట్ అసిస్టెంట్ బి.ఆనంద్‌ను గతనెల 29న కలిశాడు.


మొదట వారు ఈ సర్టిఫికెట్ ఇవ్వబోమన్నారు. అనంతరం ఈనెల 24వ తేదీన తిరిగి సర్టిఫికెట్ కావాలని కనకరాజు కోరగా, రూ.2500 ఇస్తే పని చేస్తామని వీఆర్వో చెప్పారు. ఈ క్రమంలో కనకరాజు ఏసీబీని ఆశ్రయించారు. వీఆర్వో ప్రసాద్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ రమేష్ రెడ్హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top