పురుషోత్తపురం చెక్పోస్ట్లో ఏసీబీ తనిఖీ
ఇచ్చాపురం(శ్రీకాకుళం జిల్లా): ఇచ్చాపురంలోని పురుషోత్తపురం చెక్పోస్ట్ వద్ద ఏసీబీ అధికారులు దాడులు తనిఖీలు చేస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి ప్రారంభమైన తనిఖీలు బుధవారం తెల్లవారుజాము వరకు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
పురుషోత్తపురం చెక్పోస్ట్లోని అధికారుల పనితీరుపై ఆరోపణలు రావడంతో ఏసీబీ అధికారులు దాడి చేశారు. అధికారుల పనితీరులో ఏమైనా లోపాలు ఉంటే ఈ తనిఖీలలో తేలుతుందని భావిస్తున్నారు.