'కోర్టులు చెప్పినా బాబు వినడం లేదు'
హైదరాబాద్: వైఎస్ రాజశేఖర్ రెడ్డి పథకాలకు తూట్లు పొడిచేలా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పరిపాలన ఉందని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు మేరుగ నాగార్జున తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రజాసంక్షేమ పథకాలకు ఆధార్తో ముడివేయడం సరికాదని హితవు పలికారు. అది రాజ్యాంగ విరుద్ధమని గుర్తు చేశారు. !
ఇదే విషయంపై ఇప్పటికే పలుసార్లు న్యాయ స్థానాలు తీర్పులిచ్చినా ఆధార్ తప్పని సరి అని చెప్పడం ఎంతవరకు సమంజసమని మేరుగ నాగార్జున ప్రశ్నించారు. రుణమాఫీ, ఫీజు రీయింబర్స్ మెంట్, గృహ నిర్మాణ పథకాలకు ఆధార్తో లింక్ పెట్టుకోవడం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ప్రతిపక్షంలో ఉండగా ఆధార్ లింకుపై గోల చేసిన బాబు ఇప్పుడెందుకు మరి ఆధార్తో ముడిపెడుతున్నారని నాగార్జున ప్రశ్నించారు.
సంబంధిత వార్తలు