విద్యుదాఘాతంతో యువకుని మృతి
గుంటూరు జిల్లా రావులాపురం మండలం గుడిపాళెం గ్రామానికి చెందిన భూక్యా తులసీ నాయక్(29) అనే యువకుడు ఆదివారం ఉదయం విద్యుత్ శాక్తో మృతిచెందాడు. తులసీనాయక్ సెల్ఫోన్కు చార్జింగ్ పెడుతుండగా ఒక్కసారిగా షాక్ కొట్టింది. దాంతో స్పృహతప్పి పడిపోయాడు. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ.. మృతిచెందాడు. మృతునికి భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు.