అదృశ్యమైన విద్యార్థి.. అనుమానస్పద మృతి
గుంటూరు: జిల్లాలోని నరసారావుపేట రైల్వేస్టేషన్లో ఓ విద్యార్థి అనుమానస్పద స్థితిలో మృతిచెందిన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడు నాదెళ్ల మండలం కలపారుకు చెందిన ప్రవీణ్గా పోలీసులు గుర్తించారు. అయితే ప్రవీణ్ ఆదివారం ఉదయం నుంచి అదృశ్యమైయ్యాడు.
నిన్న అదృశ్యమైన అతను రైల్వేస్టేషన్లో అనుమానస్పద స్థితిలో మృతిచెందడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్టు పోలీసులు పేర్కొన్నారు.