స్వైన్ఫ్లూ అనుమానిత లక్షణాలతో బాలింత మృతి
ఒంగోలు: ఒంగోలుకు చెందిన ఓ బాలింత స్వైన్ఫ్లూ అనుమానిత లక్షణాలతో బుధవారం మృతిచెందింది. ఒంగోలులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో మంగళవారం చేరిన ఆమెను పరిస్థితి విషమించడంతో అర్ధరాత్రి బెంగళూరు తరలించారు. మార్గమధ్యంలో బెంగళూరు శివారుల్లో బుధవారం ఉదయం మృతిచెందింది.
అయితే ఆమె నుంచి సేకరించిన నమూనాలకు సంబంధించిన నివేదిక ఇంకా హైదరాబాద్ నుంచి అందాల్సి ఉంది. కాగా, కందుకూరు అర్బన్ ప్రాంతానికి చెందిన మహిళ(30) తన తండ్రికి బాగాలేదని గుంటూరుకు వెళ్లి, అక్కడే స్వైన్ఫ్లూ అనుమానిత లక్షణాలతో ఐడీహెచ్ వైద్యశాలలో చికిత్స నిమిత్తం చేరింది. ఆమెకు స్వైన్ఫ్లూ ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించి చికిత్స అందిస్తున్నారు.