సరదా జీవితం..ప్రాణం తీసింది..!
తిరుపతి: చిన్నాచితకా పనులు చేసి సంపాదించిన డబ్బుతో సరదా జీవితం గడుపుతున్న ఓ యువకుడిని అతడి స్నేహితులే పొట్టనపెట్టుకున్నారు. వివరాలు..తిరుపతికి సమీపంలోని పాపానాయుడుపేటకు చెందిన కుమార్(20) చిన్నచిన్న వ్యాపారాలు చేస్తుంటాడు. కూడబెట్టుకున్న డబ్బుతో తిరుపతికి వచ్చి స్నేహితులతో కలసి జల్సాలు చేసి వెళ్తుంటాడు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి తిరుపతికి చేరుకున్న కుమార్ స్నేహితులతో కలసి స్థానిక తుడా కార్యాలయం సమీపంలోని ఇందిరా ప్రియదర్శిని మార్కెట్ వద్ద విందు చేసుకున్నాడు. మద్యం మత్తులో ఉన్న వారి మధ్య ఘర్షణ తలెత్తింది. కొందరు అతన్ని రాయితో కొట్టటంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.