తొమ్మిది ఇసుక లారీలు సీజ్
ఇచ్చాపురం : ఒడిశా నుంచి ఆంధ్రాలోకి ఇసుకను రవాణా చేస్తున్న తొమ్మిది లారీలను ఆదివారం తెల్లవారుజామున శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పోలీసులు సీజ్ చేశారు. తమకు అందిన సమాచారం మేరకు పోలీసులు మండలంలోని బెల్లపడ టోల్ప్లాజా వద్ద ఇసుక లారీలను ఆపి పత్రాలను తనిఖీ చేశారు.
వే బిల్లులు నకిలీవిగా అనుమానించిన పోలీసులు వాటిని సీజ్ చేశారు. ఒడిశా అధికారులను సంప్రదించి వే బిల్లుల వాస్తవికతను నిర్ధారించుకుని తదుపరి చర్యలు తీసుకుంటామని సీఐ అవతారం తెలిపారు.