ఇరు వర్గాల ఘర్షణ: 9 మందికి గాయాలు


కమలాపురం : వైఎస్సార్ జిల్లా కమలాపురం మండలంలో పొలానికి దారి ఏర్పాటు విషయమై జరిగిన కొట్లాటలో 9 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. మండలంలోని గంగవరం గ్రామంలో శనివారం ఉదయం ఈ ఘటన జరిగింది. కత్తులు, కర్రలతో దాడులు చేసుకోవటంతో రెండు వర్గాలకు చెందిన వారు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను కమలాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని, వివరాలు సేకరిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top