ఎర్రకాలువ చెరువుల నిర్మాణానికి రూ.9.66 కోట్లు
పశ్చిమగోదావరి: నిడదవోలు మండలంలోని ఎర్రకాలువ చెరువుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.9.66 కోట్లు విడుదల చేసినట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు తన స్వగృహంలో వెల్లడించారు. దీనివల్ల ప్రస్తుతం ఉన్న 34 వేల ఎకరాలతో పాటు మరో 10 వేల ఎకరాలకు 12 చెరువులు, 12 సప్లై ఛానెళ్ల ద్వారా నీరందించే అవకాశముందని ఆయన తెలిపారు. నాబార్డు ద్వారా ఈ నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు మంత్రి ధన్యవాదాలు తెలిపారు. అంతేగాక జిల్లాలో నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఎన్ఐటీ)ని ఏర్పాటు చేయడానికి వేగంగా చర్యలు జరుగుతున్నాయని మంత్రి అన్నారు.
(నిడదవోలు)