ట్రాక్టర్ ఢీకొని తండ్రీకూతురు దుర్మరణం


హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో జరిగిన రోడ్డు ప్రమాదాలలో 8 మంది దుర్మరణం చెందారు. గుంటూరు జిల్లా పెద్దకూరపాడు మండలం అబ్బరాజుపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కూతురు మృతి చెందారు. వారిద్దరూ బైకుపై వెళుతుండగా  ట్రాక్టర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.



హైదరాబాద్ మలక్‌పేట వద్ద మెట్రో పనుల కోసం తీసిన గుంటలో సిమెంట్‌ లారీ బోల్తాపడి  ఇద్దరు కార్మికులు మృతి చెందారు. హయత్‌నగర్‌ పెద్దఅంబర్‌పేట వద్ద జరిగిన రోడ్డప్రమాదంలో మరో ఇద్దరు మృతి చెందారు. డీసీఎం బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది.



రంగారెడ్డి జిల్లా  చేవెళ్ల మండలం దామరగిద్ద సమీపంలో లారీ - కారు ఢీకొని  ఇద్దరు మృతి చెందారు.  ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top