నిద్రలేచే సరికి ఇల్లు గుల్ల


పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం తాళ్లముదనూరుపాడు గ్రామంలో మంగళవారం వేకువజామున బారీ చోరీ జరిగింది. నెలగుల పట్టాభిరామిరెడ్డి అనే వ్యక్తి ఇంట్లో దొంగలుపడి 15 లక్షల రూపాయల నగదు, 750 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేశారు.


పట్టాభిరామిరెడ్డి దంపతులు నిద్రపోయిన సమయంలో దొంగలు ఇంట్లోకి ప్రవేశించి బీరువాలో ఉన్న నగదు , నగలు దోచుకెళ్లారని బాధితుడు పట్టణ పోలీసులకు మంగళవారం ఉదయం ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.



 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top