70 ఎకరాల మొక్కజొన్న దగ్ధం


ఒంగోలు : ప్రకాశం జిల్లా గవిలవారిపాళెం గ్రామంలో బుధవారం మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలో 70 ఎకరాల్లో మొక్కజొన్నపంట దగ్ధమైంది. దాదాపు కోటి రూపాయల వరకు ఆస్థినష్టం ఉంటుందని భావిస్తున్నారు. పరిసర పొలాల్లో క్రిమికీటకాల నివారణకు వేసిన మంటల వల్లే ఈ ప్రమాదం జరిగిందని బాధిత రైతులు చెబుతున్నారు. రెవెన్యూ అధికారులు సంఘటనస్థలానికి వెళ్లి పంట నష్టం వివరాలు సేకరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top