గన్ మెటల్ దొంగలు అరెస్టు


గాజువాక:  విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్‌లో గన్ మెటల్ చోరీ చేసిన ఏడుగురు దుండగులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 28 లక్షలు విలువ చేసే గన్ మెటల్‌తో పాటు బ్రాంజ్‌పైప్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు విశాఖ రెండవ జోన్ డీసీపీ రాంగోపాల్ నాయక్ శుక్రవారం విలెకరుల సమావేశంలో వివరాలు తెలిపారు.

 

అరెస్ట్ అయిన ఏడుగురిలో ఇద్దరిపై గతంలో జరిగిన ఓ హత్య కేసుతో సంబంధం ఉందని.. మరో ఇద్దరి పేర రౌడీషీట్ ఉందని ఆయన తెలిపారు. కాగా వీరికి షిప్ యార్డు సిబ్బంది కూడా సహకరించారని అనుమానిస్తున్న పోలీసులు ఇద్దరు సెక్యూరిటీ సిబ్బందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ మెటల్ సబ్ మెరైన్‌ల నిర్మాణంలో వాడతారని ఆయన తెలిపారు.

 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top