దంపతుల హత్యకేసులో ఏడుగురి అరెస్ట్
అనంతపురం: హిందుపూరం మండలం తుంగేపల్లిలో జరిగిన దంపతుల హత్యకేసుకు సంబంధించి పోలీసులు ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఈ నెల 1న తుంగేపల్లిలో బ్రాహ్మణ దంపతులను హత్యచేసిన విషయం తెలిసిందే. సుధాకర్(46) తూమకుంటలోని ఓ దేవాలయంలో అర్చకుడిగా పనిచేవారు. అతని భార్య శ్యామల(43) సంతేబిదనూరులో అంగన్వాడి టీచర్గా పనిచేసేవారు.
వారి ఇద్దరినీ 1వ తేదీ రాత్రి కొందరు వ్యక్తులు తుంగేపల్లిలో గడ్డివాముల సమీపంలో అతి దారుణంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి క్లూస్టీం, జాగిలాలతో సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశారు.
సంబంధిత వార్తలు