చిత్తూరు జిల్లాలో పేలుడు పదార్థాలు స్వాధీనం


చిత్తూరు : చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం వరిగపల్లిలో పోలీసుల తనిఖీల్లో భారీగా మందుగుండు బయటపడింది. ఓ ప్రాంతంలో రహస్యంగా నిల్వ ఉంచిన పేలుడు పదార్ధాలను పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. 600 జిలెటిన్ స్టిక్స్, 5 బస్తాల నల్లమందు, 70 బస్తాల అమ్మోనియం నైట్రేట్ను పోలీసులు సీజ్ చేశారు. ఇందుకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు.





 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top