రుణమాఫీకి 60 లక్షల ఖాతాలకు అర్హత!
రైతు రుణమాఫీకి ఇప్పటివరకు 60 లక్షల ఖాతాలను అర్హులుగా గుర్తించినట్లు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. అర్హుల జాబితాలో చేర్చేందుకు గడువు ఇంకా పొడిగించామన్నారు. ముఖ్యమంత్రి జపాన్ పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత 20 శాతం నిధులు చెల్లించే కార్యక్రమం చేపడతామని తెలిపారు. అలా ఇస్తే రైతుల ఖాతాలు ఎన్పీఏలుగా మారవని బ్యాంకర్లు హామీ ఇచ్చారన్నారు.
రబీలో పంటల బీమా కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. వ్యవసాయ మిషన్కు త్వరలో నిపుణుల కమిటీ నియమిస్తామని, ఈ మార్కెటింగ్ కోసం చర్యలు చేపడతామని పుల్లారావు వివరించారు. త్వరలోనే వ్యవసాయ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ఆదర్శ రైతుల స్థానంలో ఎంపీఈవోలను నియమిస్తామన్నారు. ఉద్యానవన శాఖ, పశు సంవర్ధక శాఖల్లో ఖాళీలను మాత్రం ఔట్సోర్సింగ్ ద్వారా భర్తీ చేస్తామన్నారు.