నీటికుంటలో పడి చిన్నారి మృతి


అనంతపురం (కల్యాణదుర్గం) : కల్యాణదుర్గం మండలం కొత్తూరులోని చెరువుకుంటలో పడి దీపిక అనే ఆరేళ్ల బాలిక మృతిచెందింది. శుక్రవారం చెరువు సమీపంలోని కుంటలలో స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ జారి అందులో పడిపోయింది. ఈ ఘటనను గమనించిన మరో ఇద్దరు చిన్నారులు విషయాన్ని గ్రామస్తులకు చెప్పగా.. వారు సంఘటనాస్థలానికి చేరుకుని బాలిక మృతదేహాన్ని వెలికి తీశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top