6 కిలోల గంజాయి స్వాధీనం


తలుపుల: అనంతపురం జిల్లా లో అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని తలుపుల మండలం బండ్లపల్లి వద్ద శనివారం ఉదయం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఫరీదా అనే మహిళ నుంచి 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని విజయవాడ నుంచి తీసుకొస్తున్నట్టు ముందస్తు సమాచారం రావడంతో ఈ దాడులు చేపట్టారు. సదరు మహిళపై కేసు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top