ఎన్టీపీసీలో పేకాటరాయుళ్ల అరెస్ట్
ఎర్రగుంట్ల (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్లలోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ) కార్యాలయంలో పేకాట ఆడుతున్న ఆరుగురిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు.
ముందస్తు సమాచారంతో కల్లమల పోలీసులు మంగళవారం సాయంత్రం దాడి చేసి ఆరుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 28 వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.